రాష్ట్రానికి పట్టిన శని జగన్: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-03-07T21:58:34+05:30 IST

సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సితార సెంటర్‌లో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు.

రాష్ట్రానికి పట్టిన శని జగన్: చంద్రబాబు

విజయవాడ: సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సితార సెంటర్‌లో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన శని జగన్ అంటూ దుయ్యబట్టారు. ప్రజల నెత్తిన పెట్టిన కుంపటి బాగా మండుతోందని చెప్పారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో ఆరోగ్యం, ఆదాయాన్ని ప్రజలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా నోరెత్తితే ప్రతి శుక్రవారం సాయంత్రం ప్రజల ఇళ్లకు ప్రొక్లెయినర్‌ పంపి విధ్వంసం సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఆదివారం విజయవాడలో రోడ్‌ షో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన రోడ్‌ షోను ప్రారంభించి నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ ప్రచారం చేస్తారు. 

Updated Date - 2021-03-07T21:58:34+05:30 IST