సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

ABN , First Publish Date - 2021-03-20T01:22:18+05:30 IST

సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. లేపాక్షి ఛార్జ్‌షీట్‌లో బీపీ ఆచార్యపై పీసీ చట్టం

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. లేపాక్షి ఛార్జ్‌షీట్‌లో బీపీ ఆచార్యపై పీసీ చట్టం సెక్షన్లు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2)ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో సీబీఐ కోర్టుకు బీపీ ఆచార్య హాజరయ్యారు. కొత్త సెక్షన్లపై హైకోర్టుకు వెళ్లేందుకు ఆచార్య సమయం కోరారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు విచారణ ఈ నెల 26కి కోర్టు వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్, ఇందూటెక్ జోన్ కేసులు ఈ నెల 26కి కోర్టు వాయిదా వేసింది. అరబిందో, హెటిరో, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసులు ఈ నెల 26కు, రఘురాం సిమెంట్స్ కేసు ఈ నెల 22కి, దాల్మియా కేసు ఏప్రిల్ 9కి, ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-03-20T01:22:18+05:30 IST