వివేకా హత్యపై జగన్ సూటిగా సమాధానం చెప్పాలి: నాగుల్ మీరా
ABN , First Publish Date - 2022-02-28T00:46:29+05:30 IST
కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత నాగుల్ మీరా దుయ్యబట్టారు.
అమరావతి: కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత నాగుల్ మీరా దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో చంద్రబాబు సిట్ వేస్తే.. ఐపీఎస్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి విచారణను ఎందుకు మార్చారని తప్పుబట్టారు. సీబీఐ విచారణ కావాలని హైకోర్టులో వేసిన పిటిషన్ను ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. వివేకా నిందితులు ఎవరో జగన్కు తెలుసు కాబట్టే పట్టుకోలేదన్నారు. వివేకా కేసు విషయంలో జగన్ తీరును చూస్తే.. అందరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. వివేకానందరెడ్డి చాలా సౌమ్యుడని అందరికీ తెలుసని చెప్పారు. అన్న వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం కావాలనే తపనతో నాడు పని చేశారని తెలిపారు. అటువంటి వివేకాను అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. దీనిపై జగన్ సూటిగా సమాధానం చెప్పాలని నాగుల్ మీరా డిమాండ్ చేశారు.