ముస్లింలను మోసగించిన జగన్
ABN , First Publish Date - 2021-03-06T09:24:20+05:30 IST
‘‘నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే జగన్మోహన్రెడ్డి ముస్లింలను నిండా మోసం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే వైసీపీని
ఇండియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్
అనంతపురం వైద్యం, మార్చి 5: ‘‘నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే జగన్మోహన్రెడ్డి ముస్లింలను నిండా మోసం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే వైసీపీని ఓడించాల్సిన అవసరం ఉంది. నమ్మి ఓటేస్తే ముస్లిం వ్యతిరేక చట్టాలకు ఆయన ఆమోదం తెలిపి తన మోసపు బుద్ధిని బయటపెట్టారు’’ అని ఇండియన్ ముస్లీం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. అనంత నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.