ఆరుగురు ‘గడప’ దాటలేదు!

ABN , First Publish Date - 2022-06-09T08:31:30+05:30 IST

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ జరుగుతున్న తీరుపై వైసీపీకి ఎన్నికల వ్యూహాలు అందిస్తున్న ‘ఐ-ప్యాక్‌’ బృందం నివేదిక అందించింది.

ఆరుగురు ‘గడప’ దాటలేదు!

జగన్‌కు ఐ-ప్యాక్‌ నివేదిక.. మొదటి నెల కాబట్టి వదిలేస్తున్నా: జగన్‌


అమరావతి, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ జరుగుతున్న తీరుపై వైసీపీకి ఎన్నికల వ్యూహాలు అందిస్తున్న ‘ఐ-ప్యాక్‌’ బృందం నివేదిక అందించింది. ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎన్ని రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో సీఎం జగన్‌కు వివరించింది. మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు ఆళ్ల నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, ప్రసన్న కుమార్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాపరెడ్డి... ఈ ఆరుగురు ఒక్కరోజుకూడా ‘గడప గడపలో’ పాల్గొనలేదని వెల్లడించింది. ఐదు నుంచి పది రోజులకంటే తక్కువగా గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించిన వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. మొదటి నెల కావడంతో  వదిలేస్తున్నానని, రాబోయే ఆరు నెలలు ఎమ్మెల్యేల తీరును పర్యవేక్షిస్తామని జగన్‌ చెప్పారు. ఆ తర్వాత అందే నివేదికను బట్టి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - 2022-06-09T08:31:30+05:30 IST