AP News: ఎంపీ గోరంట్ల నిర్వాకంపై సీఎం జగన్ ఉలకడు..పలకడు : రామకృష్ణ

ABN , First Publish Date - 2022-08-14T23:43:48+05:30 IST

Tirupati: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) నిర్వాకంపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Rama

AP News: ఎంపీ గోరంట్ల నిర్వాకంపై సీఎం జగన్ ఉలకడు..పలకడు : రామకృష్ణ

Tirupati: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) నిర్వాకంపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Rama Krishna) ప్రశ్నించారు. తిరుపతిలో జరుగుతున్న పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి అధికార పార్టీ నాయకులు పాలాభిషేకం చేయడం ఏమిటని? ప్రశ్నించారు. ఆంబోతులా బట్టలు విప్పి కనపడిన హిందూపురం ఎంపీ వీడియోలో ఉన్నది తానుకాదని నిరూపణ  చేసుకోకుండా..కులాలను దూషించడం సరైంది కాదన్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక 21 రోజులైందని, ముంపు బాధితులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.  

Updated Date - 2022-08-14T23:43:48+05:30 IST