జగనన్న ఉన్నాడు జాగ్రత్త.. తూ.గోలో రోడ్డుపైన బోర్డు

ABN , First Publish Date - 2021-12-12T16:25:34+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి వర్ణనాతీతం. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా వరకు అధ్వానంగా మారాయి.

జగనన్న ఉన్నాడు జాగ్రత్త.. తూ.గోలో రోడ్డుపైన బోర్డు

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి వర్ణనాతీతం. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా వరకు అధ్వానంగా మారాయి. ఎక్కడ రోడ్డుందో.. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే అధికారంలో ఉన్న జగన్ సర్కారు మాత్రం రోడ్ల బాగు గురించి సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గోదావరి జిల్లాల ప్రజలు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ వెటకారంతో జగన్ సర్కారుకు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రోడ్డుపై పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసే వరకు ఎవరైనా ఈ బోర్డును తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతుంది’ అనేలా జగన్ ఫొటోలతో ఫ్లెక్సీ చేయించి బోర్డు పెట్టారు. ఈ ఫొటోలను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు.

Updated Date - 2021-12-12T16:25:34+05:30 IST