1న జగన్నాథస్వామి రఽథయాత్ర మహోత్సవం

ABN , First Publish Date - 2022-06-29T06:19:09+05:30 IST

అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్‌) విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో జూలై 1న మూడు రథాలతో జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు ఇస్కాన్‌ విశాఖ నగర శాఖ అధ్యక్షుడు సాంబదాస్‌ ప్రభూజీ తెలిపారు.

1న జగన్నాథస్వామి రఽథయాత్ర మహోత్సవం
ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తున్న ఇస్కాన్‌ ప్రతినిధులు

డాబాగార్డెన్స్‌, జూన్‌ 28 : అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్‌) విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో జూలై 1న మూడు రథాలతో జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు ఇస్కాన్‌ విశాఖ నగర శాఖ అధ్యక్షుడు సాంబదాస్‌ ప్రభూజీ తెలిపారు. మంగళవారం దసపల్లా ఎగ్జిక్యూటివ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజు సాయింత్రం నాలుగు గంటలకు రథయాత్ర పాత జైల్‌రోడ్డు విశాఖ మహిళా కళాశాల నుంచి ప్రారంభమై డాబాగార్డెన్స్‌ ఎల్‌ఐసీ మీదుగా సిరిపురం గురజాడ కళాక్షేత్రం వద్ద ముగుస్తుందన్నారు. గురజాడ కళాక్షేత్రంలో జగన్నాథ సుభద్ర, బలభద్రమూర్తులను ప్రత్యేకంగా వేదికపై ఉంచి విశేష అర్చనలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. భక్తి సంగీతం, నృత్యరూపకం, ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటాయన్నారు. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో కో-ఆర్డినేటర్‌ మాతాజీ నితాయి సేవిని, ఆధ్యాత్మికవేత్త ఎం.వి.రాజశేఖర్‌, వంశీకృష్ణ ప్రభు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T06:19:09+05:30 IST