అబద్ధాలు చెప్పడంలో జగన్‌రెడ్డి దిట్ట

ABN , First Publish Date - 2022-05-22T06:47:03+05:30 IST

రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసాలు చేయడంలో సీఎం జగన్‌రెడ్డి దిట్ట అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

అబద్ధాలు చెప్పడంలో జగన్‌రెడ్డి దిట్ట
బుద్ద నాగజగదీశ్వరరావు


టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద 

అనకాపల్లి, మే 21: రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసాలు చేయడంలో సీఎం జగన్‌రెడ్డి దిట్ట అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. శనివారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో అందించాల్సిన అమ్మఒడి పథకానికి తూట్లు పొడుస్తూ లబ్ధిదారులకు మొండిచేయి చూపిస్తున్నారన్నారు. మొన్నటి వరకు విద్యార్థుల కోరిక మేరకు లాప్‌ట్యాబ్‌లను అందిస్తామని మోసం చేశారన్నారు. ప్రస్తుతం పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.2 వేలు మినహాయించి తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు వేస్తామనడం మోసం కాదా అని బుద్ద ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇంటిలో ఇద్దరు పిల్లలు పాఠశాలలకు వెళ్తే అమ్మఒడి అందిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఒక్కరికే వర్తిస్తుందని చెప్పడం దారుణమన్నారు. తెలుగుదేశం అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. అధికారంలోకి రాకముందు ఊరూరా తిరుగుతూ బాదుడే బాదుడు అంటూ స్వరాన్ని సాగదీసి ప్రజలను రెచ్చగొట్టిన జగన్‌, నేడు అన్నింటా బాదుడు కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్లు వేసిన పాపానికి రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని బుద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-05-22T06:47:03+05:30 IST