TS News: రాష్ట్రంపై కేంద్రం చర్యలు దుర్మార్గం: జగదీష్రెడ్డి
ABN , First Publish Date - 2022-08-19T23:41:43+05:30 IST
రాష్ట్రంపై కేంద్రం చర్యలు దుర్మార్గంగా ఉన్నాయని మంత్రి జగదీష్రెడ్డి (Jagdish Reddy) ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
నల్లగొండ: రాష్ట్రంపై కేంద్రం చర్యలు దుర్మార్గంగా ఉన్నాయని మంత్రి జగదీష్రెడ్డి (Jagdish Reddy) ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకోవడం దేశద్రోహం లాంటిదేనని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్లలో ఒక్క రూపాయి బిల్లు కూడా పెండింగ్ లేదని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కేంద్రం అడ్డుకోవాలని చూస్తోందని, పాలనలో కేంద్రం ఫెయిల్ అయిందని, సీఎం కేసీఆర్ (CM KCR) పాస్ అవుతున్నారనే బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీ కుట్రలను ప్రజల్లో ఎండగడతామని జగదీష్రెడ్డి తెలిపారు.