Minister Jagdish Reddy: బెంగాల్ తరహా రాజకీయం తెలంగాణలో నడవదు..
ABN , First Publish Date - 2022-08-24T21:40:22+05:30 IST
బీజేపీ (BJP) నేతలపై మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సూర్యాపేట (Suryapet): బీజేపీ (BJP) నేతలపై మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజాసింగ్ (Rajasingh) సస్పెన్షన్ పెద్ద డ్రామా అని, బీజేపీ నాయకుల కుట్రల వెనుక కేంద్రం పెద్దల హస్తం ఉందని విమర్శించారు. ఆ విధంగా రాజాసింగ్తో మాట్లాడించింది జాతీయ బీజేపి నాయకులేనని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా తెలంగాణ (Telangana) అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందన్నారు. తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి, రాజకీయ లబ్ది పొందటమే బీజేపీ నాయకుల లక్ష్యమన్నారు. బెంగాల్ తరహా రాజకీయం తెలంగాణలో నడవదన్నారు. బీజేపీ నాయకులు చట్ట సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ దర్యాప్తు సంస్థ చెప్పిందని లిక్కర్ స్కాం (Liquor scam) గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎంపీ ఆరోపిస్తే తెలంగాణలో ఎందుకు దాడులు చేస్తున్నారని నిలదీశారు. బీజేపీ నేతల అరాచకాలను మొత్తం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.