AP: వైసీపీ కౌన్సిలర్ తల్లి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-11-20T16:55:23+05:30 IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో వైసీపీ కౌన్సిలర్ తల్లి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది.

AP: వైసీపీ కౌన్సిలర్ తల్లి ఆత్మహత్యాయత్నం

విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో వైసీపీ కౌన్సిలర్ తల్లి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన నూకల సాంబశివరావు తల్లి నూకల మంగతాయారు బావిలోకి దూకి బలవన్మరణానికి యత్నించారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను రక్షించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2021-11-20T16:55:23+05:30 IST