TRS ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ నిల్: Jaggareddy
ABN , First Publish Date - 2022-06-27T19:16:34+05:30 IST
సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమంలోలో భాగంగా జిల్లా కలెక్టర్ శరత్ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) కలిసి..
Sangareddy : సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమంలోలో భాగంగా జిల్లా కలెక్టర్ శరత్ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) కలిసి పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. వారం రోజులుగా కలెక్టర్ అపాయింట్మెంట్ దొరకనందున... ప్రజావాణిలో కలిశానన్నారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అధికారులు, ముఖ్యమంత్రులు అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చేవారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం(TRS Government)లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఇందులో అధికారులను తప్పు బట్టబోనన్నారు. సంగారెడ్డిలో లాకౌట్ అయిన గణపతి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కలెక్టర్ను కోరానని జగ్గారెడ్డి వెల్లడించారు. క్రషింగ్ సీజన్ దగ్గరపడుతోందని.. ఫ్యాక్టరీ తెరవకపోతే రైతులు నష్టపోతారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.