అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్‌

ABN , First Publish Date - 2022-07-07T06:23:03+05:30 IST

అణగారిన వర్గాల అశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్‌ అని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ అన్నారు.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్‌

 ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ 

 వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూలై 7: అణగారిన వర్గాల అశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్‌ అని  ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ అన్నారు.  భారత తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. సూర్యాపేటలోని కొత్త బస్‌సే ్టషన్‌ సమీపంలో ఉన్న జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి శ్రీనివాస్‌మాదిగ పూలమా లలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. సమాజంలో మార్పు కోసం ఆయన యత్నించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షుడు పడిదల రవికుమార్‌, లక్ష్మణ్‌,  జానయ్య, పరశురాం పాల్గొన్నారు.

-నేటి యువతకు జగ్జీవన్‌రామ్‌ ఆదర్శనీయుడని మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు అన్నారు. నడిగూ డెంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లా డారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిడమర్తి సైదులు, ఏపూరి పర్వతాలు,  లింగయ్య, గడ్డం మల్లేష్‌, బానాల నాగరాజు, దాసరిశ్రీనివాస్‌, సతీష్‌, కె.శ్రీని వాస్‌, నవీన్‌, క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

- దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్‌ అని ఎమ్మార్పీయస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతాబాబు అన్నారు. కోదాడ పట్టణ అధ్యక్షుడు కందుల శ్రీను ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహ దారిలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి ఆయన నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో బచ్చలకూర నాగరాజు, గంధం పాండు, సిద్దల రాంబాబు, ఉపేందర్‌, విజయ్‌, ఏసు  శ్రీకాంత్‌, ఉపేందర్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-07T06:23:03+05:30 IST