ఢిల్లీ జహంగిర్‌పురి హింస కేసులో మరో కీలక కుట్రదారు అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-28T22:50:37+05:30 IST

ఢిల్లీ: జహంగిర్‌పురి హింస కేసులో మరో కీలక కుట్రదారు ఫరీద్‌ను ఢిల్లీ పోలీసులు పశ్చిమబెంగాల్‌లో అరెస్ట్ చేశారు.

ఢిల్లీ జహంగిర్‌పురి హింస కేసులో మరో కీలక కుట్రదారు అరెస్ట్

ఢిల్లీ: జహంగిర్‌పురి హింస కేసులో మరో కీలక కుట్రదారు ఫరీద్‌ను ఢిల్లీ పోలీసులు పశ్చిమబెంగాల్‌లో అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రపై ఫరీద్ కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అతడిపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉంది.


ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన జాఫర్, బద్రుద్దీన్‌లను జహంగిర్‌పురి నుంచి పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మారణాయుధాలతో మూకను హింసకు ప్రేరేపించారని పోలీసులు గుర్తించారు.  ఏప్రిల్ 16నాటి ఘటనలో 9 మంది గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది పోలీసులు కూడా ఉన్నారు. నాటి హింసలో అనేక వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. 



Updated Date - 2022-04-28T22:50:37+05:30 IST