Jahirabad: మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-06-22T16:49:26+05:30 IST

జిల్లాలోని జహీరాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Jahirabad: మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తం

సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ పర్యటన సందర్భంగా నిరసనలకు దిగిన మామిడిగి, ఎల్గోయి గ్రామాల భూ బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. పోలీసుల లాఠీఛార్జ్‌తో మహిళా రైతు స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చివరకు ఎల్గోయి, మామిడిగి గ్రామాలలో భూ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


కాగా... కాసేపట్లో జిల్లాలో పర్యటించినున్న కేటీఆర్... నిమ్జ్‌లో తొలి పరిశ్రమ స్థాపనకు భూమిపూజ చేయనున్నారు. ఈక్రమంలో కేటీఆర్‌ను రైతులు అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతులు గ్రామాల నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. నిమ్జ్ భూసేకరణకు వ్యతిరేకంగా పలుగ్రామాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-06-22T16:49:26+05:30 IST