జై హనుమాన్!
ABN , First Publish Date - 2022-05-26T09:55:31+05:30 IST
జై హనుమాన్.. జై భజరంగ్భళీ.. నినాదాలతో బెజవాడ పులకించి పోయింది.
బెజవాడలో హనుమాన్ శోభాయాత్ర...భారీ బైక్ ర్యాలీ
విజయవాడ(సత్యనారాయణపురం), మే 25: జై హనుమాన్.. జై భజరంగ్భళీ.. నినాదాలతో బెజవాడ పులకించి పోయింది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీ హనుమాన్ శోభాయాత్ర, బైక్ర్యాలీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. సత్యనారాయణపురం రామకోటి బీఆర్టీయస్ రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మున్సిపల్ కార్పొరేషన్ వరకు సాగింది. యువతలో కార్యదీక్ష, సంకల్ప సిద్ధి, శౌర్య, ధైర్య పరాక్రమాలను నింపే లక్ష్యంతో శోభాయాత్ర నిర్వహిస్తున్నామని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ యాత్రలో శివస్వామి, మాతా శివచైతన్య, అహోబిల జీయర్స్వామి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ భరత్కుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, వీహెచ్పీ మహానగర్ అధ్యక్షులు సానా శ్రీనివాస్, శివస్వామి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, యామినీ శర్మ తదితరులు పాల్గొన్నారు.