వరకట్నం వేధింపుల కేసులో వ్యక్తికి జైలుశిక్ష
ABN , First Publish Date - 2020-12-04T04:37:06+05:30 IST
మండల పరిధిలో కొత్తపల్లెకు చెందిన వెంకటసుబ్బారెడ్డిపై 2017 సంవత్సరంలో వరకట్నం కేసు నమోదైంది.
వల్లూరు, డిసెంబరు 3: మండల పరిధిలో కొత్తపల్లెకు చెందిన వెంకటసుబ్బారెడ్డిపై 2017 సంవత్సరంలో వరకట్నం కేసు నమోదైంది. ఆ కేసులో ఆ వ్యక్తికి గురువారం ఆరు నెలలు జైలుశిక్ష, 5 వేలు జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షలు నష్టపరిహారం అందించాలని, అలాగే తల్లి, అన్నకు వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్టేట్ర్ ప్రత్యూషకుమారి తీర్పునిచ్చినట్లు ఎస్ఐ రాజగోపాల్ తెలిపారు.