అకారణంగా జైళ్లకు పంపొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదా?: నక్కా ఆనందబాబు

ABN , First Publish Date - 2021-05-19T22:43:36+05:30 IST

ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని కూడా ధిక్కరిస్తూ ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతోందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.

అకారణంగా జైళ్లకు పంపొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదా?: నక్కా ఆనందబాబు

అమరావతి: ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని కూడా ధిక్కరిస్తూ ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతోందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులు నమోదు చేయవద్దని.. అకారణంగా జైళ్లకు పంపొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదా? అని ఆనందబాబు ప్రశ్నించారు. కొందరు పోలీసులు టీడీపీకి చెందినవారిపై పనిగట్టుకొని అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏబీఎన్, టీవీ5 ఛానళ్లపై కేసులు పెడితే మిగతా ఛానళ్లు స్పందించవా? అని ప్రశ్నించారు. అన్ని న్యూస్ ఛానళ్లు తమకు మద్దతిస్తున్నాయని, ప్రభుత్వం పడుతున్న సంబరపాటు ఎల్లకాలం ఉండదని ఆనందబాబు హెచ్చరించారు.

Updated Date - 2021-05-19T22:43:36+05:30 IST