ఎంపీ మాలోతు కవితకు జైలుశిక్ష
ABN , First Publish Date - 2021-07-25T07:56:20+05:30 IST
ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలతో 2019 ఏప్రిల్ 4న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా...
- ఎన్నికల్లో డబ్బు పంపిణీ అభియోగాలు
- ఆర్నెల్ల జైలు, 10 వేల జరిమానా విధింపు
- కోర్టు తీర్పు.. జరిమానా చెల్లించడంతో బెయిల్
బూర్గంపాడు, జూలై 24: ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలతో 2019 ఏప్రిల్ 4న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీ్సస్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా వార్డు సభ్యుడు షౌకత్ అలీ, ఏ2గా కవిత ఉన్నారు. ఈ కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం వీరిద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష, రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇద్దరూ రూ.10వేలు చొప్పున జరిమానా చెల్లించడంతో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.