జైనుల శోభాయాత్ర
ABN , First Publish Date - 2022-07-02T06:26:10+05:30 IST
జైనుల శోభాయాత్ర భక్తి పారవశ్యంతో సాగింది. మహిళలు ప్రత్యేక దుస్తులు ధరించి కలశాలను శిరస్సున ధరించి, భక్తి పాటలు పాడుకుంటూ శోభాయాత్రలో పాల్గొని వన్నెతెచ్చారు.
జైనుల శోభాయాత్ర
వన్టౌన్, జూలై 1: జైనుల శోభాయాత్ర భక్తి పారవశ్యంతో సాగింది. మహిళలు ప్రత్యేక దుస్తులు ధరించి కలశాలను శిరస్సున ధరించి, భక్తి పాటలు పాడుకుంటూ శోభాయాత్రలో పాల్గొని వన్నెతెచ్చారు. జైనగురువు విజయతీర్ధభద్ర సురీశ్వర్జీ, తన శిష్యబృందంతో చాతుర్మాస దీక్ష చేపట్టేందుకు శుక్రవారం నగరానికి విచ్చేశారు. వన్టౌన్లోని వట్టూరి వారివీధిలోని జైనదైవాలయం నుంచి శోభాయాత్ర సాగింది. శోభాయాత్రకు భక్తులు తమ సంప్రదాయం మేరకు నేలపై బియ్యంచల్లి పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. ఽశోభాయాత్ర మార్వాడిగుడి వీధిలోని సంభవనాథ్ భవన్ వద్దకు చేరుకుంది. జైన్కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ బోడోతరియా, ఉపాధ్యక్షులు అశోక్జైన్, జయంతిలాల్ జైన్, కార్యదర్శి పన్నాలాల్ జైన్, సహాయకార్యదర్శి పన్నాలాల్జైన్, కోశాధికారి డుంగర్మల్ జైన్, సహకోశాధికారి రాహుల్జైన్, అధికార ప్రతినిధి ప్రవీణ్రాజాలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.