ఇరువాడలో నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ బృందం పర్యటన

ABN , First Publish Date - 2020-12-03T05:43:36+05:30 IST

నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ బృందం ఇరువాడలో బుధవారం పర్యటించింది.

ఇరువాడలో నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ బృందం పర్యటన
ఇరువాడలో పర్యటిస్తున్న బృందం సభ్యులు

అచ్యుతాపురం, డిసెంబరు 2 : నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ బృందం ఇరువాడలో బుధవారం పర్యటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరు అందించనున్నారు. ఇందుకు లబ్ధిదారుడు కేవలం పది శాతం చెల్లిస్తే, మిగిలిన తొంభై శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. మండలంలో మొదటి విడతగా ఇరువాడ గ్రామాన్ని ఎంపిక చేశారు. దీంతో బృందం ప్రతినిధి సంజీవ్‌ కుమార్‌శర్మ, సభ్యుడు పార్థశారధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రవికుమార్‌, డీఈ నాగేశ్వరరావు, ఎంపీడీవో మహేశ్‌ తదితరులు గ్రామంలో పరిస్థితులను పరిశీలించారు. 

Updated Date - 2020-12-03T05:43:36+05:30 IST