జగన్ ఏపీని నాశనం చేశారు: జలీల్ఖాన్
ABN , First Publish Date - 2022-03-06T18:02:32+05:30 IST
జగన్రెడ్డి మూడేళ్ల పాలనలో ఏపీని నాశనం చేశారని మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: జగన్రెడ్డి మూడేళ్ల పాలనలో ఏపీని నాశనం చేశారని మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని లేకుండా పరిపాలించిన ఏకైక నాయకుడిగా.. జగన్రెడ్డిని గిన్నిస్ బుక్లో ఎక్కించాలని ఎద్దేవాచేశారు. సినిమా టికెట్ల రేట్లు కాదు.. ఇసుక, సిమెంట్, పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో ముస్లింలకు ఏం చేశారో చెప్పాలి? అని జలీల్ఖాన్ ప్రశ్నించారు.