Janagama: ప్రైవేట్ బస్సు దగ్ధం ..26 మంది ప్రయాణికులు సురక్షితం
ABN , First Publish Date - 2021-10-18T12:29:44+05:30 IST
జనగామ జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం అయ్యింది. ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్లో పొగ
జనగామ: జనగామ జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం అయ్యింది. ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్లో పొగ రావడం చూసి బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారుగా 26 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో నుంచి పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగుతుండటంతో ఫైర్ ఇంజన్కు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.