Padayatra: గుడ్లవలేరులో అమరావతి పాదయాత్రకు జననీరాజనం
ABN , First Publish Date - 2022-09-24T16:37:30+05:30 IST
కృష్ణా జిల్లా గుడ్లవలేరులో అమరావతి పాదయాత్రకు జననీరాజనం పలికారు.
విజయవాడ: కృష్ణా జిల్లా గుడ్లవలేరులో అమరావతి పాదయాత్ర(Amaravati padayatra)కు జననీరాజనం పలికారు. సాంప్రదాయ రీతిలో ఎడ్ల బళ్ళతో స్వాగతం పలికిన రైతులు ఆపై పాదయాత్రలో కొనసాగుతున్నారు. పాదయాత్రకు వస్తున్న రథానికి బిందెలతో పసుపు నీళ్లు జల్లి మహిళలు స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు పాదయాత్రను పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. గుడివాడ పోలీసుల తీరుపై మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపే ప్రజలు మండిపడుతున్నారు. మహా పాదయాత్రకు వచ్చేవారిని అడ్డుకుంటే అడ్డుకున్న చోటే నిరసన తెలపాలని నిర్ణయించారు.