సందడిగా తెలంగాణ బోనాల జానపద జాతర

ABN , First Publish Date - 2021-07-26T06:35:46+05:30 IST

తెలంగాణ జానపద నృత్యాలతో

సందడిగా తెలంగాణ బోనాల జానపద జాతర
వేణుగోపాలచారిని సత్కరిస్తున్న అతిథులు

రవీంద్రభారతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జానపద నృత్యాలతో కళాకారులు హోరెత్తించారు. భారత ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షుడు లయన రమణారావు, ఏబీసీ ఫౌండేషన అధ్యక్షురాలు లయన లలితరావుల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ బోనాల జానపద జాతర పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాకారులు జానపద నృత్యాలతో అలరించారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్‌.వేణుగోపాలచారి అభినందించారు. కార్యక్రమంలో పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన చైర్మన కోలేటి దామోదర్‌, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, తదితరులు పాల్గొని కళాకారులను సత్కరించి అభినందించారు. 


Updated Date - 2021-07-26T06:35:46+05:30 IST