కేసీఆర్కు జానారెడ్డి సవాల్
ABN , First Publish Date - 2021-04-13T21:54:05+05:30 IST
సాగర్ ఉపఎన్నిక సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడెక్కుతోంది. తాజాగా సీఎం కేసీఆర్కు జానారెడ్డి సవాల్
నల్గొండ: సాగర్ ఉపఎన్నిక సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడెక్కుతోంది. తాజాగా సీఎం కేసీఆర్కు జానారెడ్డి సవాల్ విసిరారు. ఎల్ఎల్సీ-2లో 7వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం నిరూపిస్తే సాగర్ ఉప ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకుంటానని సీఎం కేసీఆర్కు జానారెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలోనే 90శాతం వరద కాలువ పనులు పూర్తయ్యాయని జానారెడ్డి తెలిపారు.
హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీగా విభజించి అన్ని అనుమతులు తెచ్చామని ఆయన పేర్కొన్నారు. సాగర్ లెఫ్ట్ కెనాల్పై లిఫ్ట్లపై కేసీఆర్ ఏనాడూ సమీక్ష చేయలేదని ఆయన విమర్శించారు. తన ఆలోచన ఫలితమే లెఫ్ట్ కెనాల్పై లిఫ్ట్లు అని జానారెడ్డి తెలిపారు.