ఏపీలో స్కూళ్ల విలీనంపై Pawan వ్యంగ్య కార్టూన్ ట్వీట్

ABN , First Publish Date - 2022-07-09T16:42:47+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల విలీనంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో స్కూళ్ల విలీనంపై Pawan వ్యంగ్య కార్టూన్ ట్వీట్

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల విలీనంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేం కూడా మా చిన్నప్పుడు ఐదారు క్రోసులు నడుచుకుంటా బడికి వెళ్లేవాళ్లంరా.. మనవడా. మళ్లీ ఇప్పుడు మీ ముద్దుల సీఎం మామా.. మిమ్మల్ని వెనకటి రోజులకు తీసుకువెళ్తున్నాడన్న మాట!!’’ అంటూ పవన్ వ్యంగ్య కార్టూన్‌‌ ట్వీట్ చేశారు. 


మరోవైపు రాష్ట్రంలో పాఠశాలల విలీనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. గత రెండు రోజులుగా వివిధ పాఠశాలల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. పాఠశాలల విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కిలో మీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు ఎలా వెళ్లాలి అంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్న విషయం తెలిసిందే. 



Updated Date - 2022-07-09T16:42:47+05:30 IST