రెంటచింతల రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం: pawan
ABN , First Publish Date - 2022-05-30T18:24:19+05:30 IST
పల్నాడు జిల్లా రెంటచింతలలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
అమరావతి: పల్నాడు జిల్లా రెంటచింతలలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యాను అని తెలిపారు. శ్రీశైలంలో దర్శనానికి వెళ్ళి వస్తున్న వీరంతా మృత్యువాతపడటం అత్యంత బాధాకరమని ఆవేదన చెందారు. ఆ కుటుంబాలకు జనసేనాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వ్యవసాయ కూలీ పనులపై ఆధారపడి జీవించే ఆ కుటుంబాల వారిని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో గాయాల పాలైనవారికి మెరుగైన వైద్యం అందించాలి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.