సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఘటన దురదృష్టకరం: Pawan
ABN , First Publish Date - 2022-06-17T20:44:59+05:30 IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమైనవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
అమరావతి/హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమైనవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) అన్నారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంపై చేపట్టిన ఈ నిరసనల నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని తెలిపారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి జనసేనాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.