Janasena.. ఇది వైసీపీ గూండాల పనే: జనసేన
ABN , First Publish Date - 2022-09-01T16:36:11+05:30 IST
జనసేన (Janasena) పార్టీ జెండా దిమ్మెను అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా (NTR Dist.): జగ్గయ్యపేటలో కోదాడ రోడ్డులో ఆవిష్కరించనున్న జనసేన (Janasena) పార్టీ జెండా దిమ్మెను అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అనుమతి లేకుండా దిమ్మె నిర్మించారని పోలీసులు అన్నారు. వైసీపీ (YCP) గూండాలో తమ పార్టీ జెండా దిమ్మెను కూల్చివేశారని జనసేన నేతలు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయ్ బాను (MLA Samineni) నేతృత్వంలో ఇదంతా జరిగిందని జనసేన నేత పోతిన మహేష్ (Potina Mahesh) ఆరోపించారు. గురువారం ఉదయం జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ (Ramakrishna) చేతుల మీదుగా జనసేన పార్టీ జెండా దిమ్మెను ఆవిష్కరించాల్సి ఉంది. వైసీపీ గూండాలపై పోలీసులు రైడీ షీటు తెరవాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.