Janasena Leader: వైసీపీ నేతలను చీర్‌గాల్స్ అన్న జనసేన నేత

ABN , First Publish Date - 2022-09-19T16:51:41+05:30 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడగానే చీర్ గాల్స్‌గా వైసీపీ నేతలు బయటకు వస్తున్నారని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ యెద్దేవా చేశారు.

Janasena Leader: వైసీపీ నేతలను చీర్‌గాల్స్ అన్న జనసేన నేత

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మాట్లాడగానే చీర్ గాల్స్‌గా వైసీపీ నేతలు(YCP Leaders) బయటకు వస్తున్నారని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ (Bonaboina srinivas yadav) యెద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... పేర్ని నాని (Perni nani) ఐటమ్ రాజాగా మారారన్నారు. వైసీపీ (YCP)కి సర్వే రిపోర్ట్ భయం బాగా పట్టుకుందని తెలిపారు. పవన్ కళ్యాణ్‌ (Janasena chief)ను ఏం చేయలేక... వాళ్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నానికి మంత్రి పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తండ్రి పేర్ని వెంకట్రామయ్య వారసత్వంగా నానికి మంత్రి పదవి వచ్చిందని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంగా జగన్‌కు సీఎం పదవి వచ్చిందని అన్నారు. పీకేతో ప్రతిసారి చిలక జోస్యం చెప్పించుకుంటున్నారని.. చిలక జోస్యంతో తమకు చమటలు పడుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక మీ అందరి లెక్కలు తేలుస్తామని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ (Janasena leader) స్పష్టం చేశారు. 


Updated Date - 2022-09-19T16:51:41+05:30 IST