కౌలు రైతులకు వైసీపీ సరైన న్యాయం చేయడం లేదు: Nadendla

ABN , First Publish Date - 2022-07-14T17:51:02+05:30 IST

కౌలు రైతులకు వైసీపీ సరైన న్యాయం చేయడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

కౌలు రైతులకు వైసీపీ సరైన న్యాయం చేయడం లేదు: Nadendla

కాకినాడ: కౌలు రైతులకు వైసీపీ(YCP) సరైన న్యాయం చేయడం లేదని జనసేన(Janasena) నేత నాదెండ్ల మనోహర్(Nadendla manohar) విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కౌలు రైతుల ఆత్మహత్యలపై వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడుతున్నారన్నారు. రైతుల కష్టాలపై సరైన తీరులో ముఖ్యమంత్రి స్పందించడం లేదని ప్రజలకు అర్ధమైందని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్నవారు రైతులే కాదని వారిని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిది వందల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సర్కార్ అంగీకరించిందని...వారందరికీ  ఏడు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈనెల 16న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మండపేట చేరుకుని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల ఇంటికి వెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. 16న పవన్ కళ్యాణ్ సభకు రాకుండా పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ  హయాంలో 3 వేల మంది చనిపోతే... కేవలం 800 మంది చనిపోయారు అని వైసీపీ నాయకులు చెప్పడం దారుణమని నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

Updated Date - 2022-07-14T17:51:02+05:30 IST