కాకినాడలో Nadendla పర్యటనపై పోలీసుల ఆంక్షలు
ABN , First Publish Date - 2022-07-14T19:58:46+05:30 IST
కాకినాడలో జనసేన నేత నాదేండ్ల మనోహర్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.
కాకినాడ: కాకినాడలో జనసేన నేత నాదేండ్ల మనోహర్ (Nadendla manohar) పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయన వెంట కోనసీమ వెళ్తున్న వాహన శ్రేణికి పోలీసులు ఆటంకాలు సృష్టించారు. పోలీసుల తీరును నిరసిస్తూ తూరంగి వద్ద రోడ్డుపై జనసేన నేతలు బైఠాయించారు. అన్ని వాహనాలను ముమ్మిడివరంలోకి వెళ్ళడానికి అనుమతించాలని మనోహర్ కోరగా... కుదరదని పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాల్లారేవు మండలం చోల్లాంగి వద్ద రోడ్డుపై బైఠాయించిన ధర్నాకు దిగారు. ఎట్టకేలకు దిగివచ్చిన పోలీసులు... వాహనాలకు అనుమతి ఇవ్వడంతో జనసేన శ్రేణులు అక్కడి నుంచి బయలుదేరారు.