గంజాయిపై నల్గొండ ఎస్పీ వ్యాఖ్యలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన పవన్
ABN , First Publish Date - 2021-10-27T14:53:27+05:30 IST
ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుందంటూ నల్గొండ ఎస్పీ రంగనాధ్ చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
అమరావతి: ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుందంటూ నల్గొండ ఎస్పీ రంగనాధ్ చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘ఏపీ నార్కోటిక్స్ హబ్గా మారింది & ప్రతి స్థాయిలో చాలా మంది డ్రగ్స్ లార్డ్లతో నిండిపోయింది. ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ ఇన్ఛార్జ్లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని రంగనాధ్ మాటలతో అర్ధమవుతుంది’’ అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.