ప్రజా జీవితంలో గౌతమ్ హుందాగా వ్యవహరించారు: Pawan
ABN , First Publish Date - 2022-02-21T17:35:10+05:30 IST
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరమన్నారు. విద్యాధికుడైన ఆయన ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించారని తెలిపారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డికి, కుటుంబ సభ్యులకు పవన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.