కర్షకుల కష్టాలు, కన్నీళ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: పవన్
ABN , First Publish Date - 2020-12-02T19:21:51+05:30 IST
కర్షకుల కష్టాలు, కన్నీళ్లను కేంద్రం దృష్టి కి తీసుకెళతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
కృష్ణా: కర్షకుల కష్టాలు, కన్నీళ్లను కేంద్రం దృష్టి కి తీసుకెళతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. బుధశారం పామర్రు నియోజకవర్గంలో పంట పొలాలను పవన్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం రైతులను నట్టేట ముంచిందని.. చేతికంది వచ్చిన పంట చేజారిపోవడం బాధాకరమని అన్నారు. ‘‘మీకు అండగా ఉండలానే మీ దగ్గరకు వచ్చాను’’ అని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయం చేయమని స్పష్టం చేశారు. ఓట్ల సమయంలోనే వచ్చి వెళ్లే వ్యక్తిని కానని.. ఇప్పుడు ఎన్నికలు లేవని తెలియజేశారు. ప్రజల బాధలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకే వచ్చానని స్పష్టం చేశారు. కష్టించి పండించిన పంట మొత్తం దెబ్బతిందని... సొంత భూమి రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కన్నీళ్లు మన దేశానికి మంచిది కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు.