Potina mahesh: పవన్ను చూసి జగన్ బుద్ధి తెచ్చుకోవాలి
ABN , First Publish Date - 2022-08-22T15:46:47+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను చూసి ముఖ్యమంత్రి జగన్ బుద్ధి తెచ్చుకోవాలని జనసేన నేత పోతిన వెంకట మహేష్ హితవుపలికారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan)ను చూసి ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) బుద్ధి తెచ్చుకోవాలని జనసేన నేత పోతిన వెంకట మహేష్ (Potina venkata mahesh) హితవుపలికారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం చేయాల్సిన పనిని పవన్ కళ్యాణ్చే (janasena chief)శారన్నారు. సొంత జిల్లా కడపలో కౌలు రైతులను గాలికొదిలేసిన గాలి ముఖ్యమంత్రి సీఎం జగన్ (Jagan mohan reddy) అని మండిపడ్డారు. తన సొంత నియోజకవర్గంలో కౌలు రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ (Pawan) కౌలు రైతులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి అండగా నిలబడ్డారని తెలిపారు. సీఎం సొంత జిల్లాలో 176 మంది ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరికి కూడా పరిహారం అందించలేదన్నారు. ఈ ముఖ్యమంత్రి(AP CM) రైతు ద్రోహి అని... అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ రైతు పక్షపాతి అని చెప్పారు. 3 సంవత్సరాల సీఎం జగన్ పాలనలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్కరికి కూడా పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదన్నారు. నిజంగా మంత్రుల (AP Ministers)కు సిగ్గుంటే కోనసీమలో రైతులు క్రాప్ హాలిడేపై స్పందించాలని పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యలు చేశారు.