AP News: మహాసేన రాజేష్ను అణచివేయాలని చూడటం దుర్మార్గం: పోతిన మహేష్
ABN , First Publish Date - 2022-07-21T20:52:55+05:30 IST
ప్రశ్నించే గొంతుక మహాసేన రాజేష్ను అణచివేయాలని చూడటం దుర్మార్గమని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు.
విజయవాడ: ప్రశ్నించే గొంతుక మహాసేన రాజేష్(Rajesh)ను అణచివేయాలని చూడటం దుర్మార్గమని జనసేన నేత పోతిన వెంకట మహేష్(Potina venkata mahesh) అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ మంత్రి తానేటి వనిత(Taneti vanita).. పోలీస్ కేసులతో ఇబ్బంది పెట్టడం అప్రజాస్వామిక చర్య. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయి. ఉద్యమ స్వరాన్ని అణచి వేయలనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఉండదు. సమస్యలపై రాజేష్ చేసే ప్రతి పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’’ అంటూ పోతిన వెంకట మహేష్ ట్వీట్ చేశారు.