ప్రచారానికే దిశా చట్టం: Janasena leaders

ABN , First Publish Date - 2022-02-01T16:47:15+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశా చట్టం ప్రచారానికే పరిమితమని జనసేన నేతలు బిట్రగుంట మల్లిక, యర్రంశెట్టి పద్మావతి విమర్శించారు.

ప్రచారానికే దిశా చట్టం: Janasena leaders

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశా చట్టం ప్రచారానికే పరిమితమని జనసేన నేతలు బిట్రగుంట మల్లిక, యర్రంశెట్టి పద్మావతి విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దిశా చట్టం పని చేస్తే మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. దిశా చట్టం ద్వారా ఏ ఒక్క మహిళకు న్యాయం జరగలేదన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని తెలిపారు. పేకాట, క్యాసినోలు నడపడం, మద్యం విచ్చల విడిగా అమ్మకాలపైనే ప్రభుత్వం శ్రద్ద పెడుతోందని మండిపడ్డారు. విజయవాడ మైనర్ బాలిక నిందితుడికి ఉరి శిక్ష విధించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-01T16:47:15+05:30 IST