ముస్లిం మైనార్టీలను దగా చేసిన వైసీపీ సర్కార్
ABN , First Publish Date - 2022-06-25T05:33:56+05:30 IST
రాష్ట్రంలో దుల్హన్ పథకం రద్దుతో ముస్లిం మైనార్టీ ప్రజలు జగన్ సర్కారు మోసం చేసిందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు.
జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె విమర్శలు
గుంటూరు, జూన్ 24: రాష్ట్రంలో దుల్హన్ పథకం రద్దుతో ముస్లిం మైనార్టీ ప్రజలు జగన్ సర్కారు మోసం చేసిందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం లాడ్జి సెంటర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కుర్చీ ఎలాగన్నా దక్కించుకోవాలనే ఏకైన ధ్యేయంతో.. ఎన్నికల ముందు అలవికాని హామీలతో అన్నివర్గాల ప్రజలను నమ్మించి గదె ్ద నెక్కిన జగన్ రెడ్డి తీరా సీఎం అయ్యాక వివిధ పధకాల రద్దుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి పధకలను రోజుకో నిబంధనతో పేదలు, అర్హులను దూరం చేశారని ఆయన ఆరోపించారు. పేదలు, యువత ఉపాధికిగా గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సుమారు 26 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి ఆయా లబ్ధిదారుల జీవితాలతో ఆటలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల జీవితాలు సంక్షోభంలో పడ్డాయని ఆయన విమర్శించారు. సమావేశంలో జనసేన నాయకులు ఆళ్ల హరి, బిట్రగుంట మల్లిక, నారదాసు ప్రసాద్, షేక్ ఆసియా, మధులాల్, షర్ఫుద్దీన్, శిఖా బాలు తదితరులు పాల్గొన్నారు.