పంటల బీమాలో అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే!
ABN , First Publish Date - 2022-06-28T06:01:18+05:30 IST
పంటల బీమా చెల్లింపుల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు చేతివాటం ప్రదర్శించి నిజమైన రైతులకు రావాలసిన మొత్తాలను బినామీ పేర్లతో కాజేశారని జనసేన నాయకులు ఆరోపించారు. ఆలమూరు మండలంలో జరిగిన అక్రమాలు రోజుకొక రకంగా బయటపడుతున్నాయని, వీటిపై నిగ్గు తేల్చాలని జనసేన కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసైనికులు సోమవారం ఆలమూరులో కదంతొక్కారు.
- జనసేన కొత్తపేట నియోజకవర్గ ఇనచార్జి బండారు శ్రీనివాసరావు డిమాండ్
ఆలమూరు, జూన్ 27: పంటల బీమా చెల్లింపుల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు చేతివాటం ప్రదర్శించి నిజమైన రైతులకు రావాలసిన మొత్తాలను బినామీ పేర్లతో కాజేశారని జనసేన నాయకులు ఆరోపించారు. ఆలమూరు మండలంలో జరిగిన అక్రమాలు రోజుకొక రకంగా బయటపడుతున్నాయని, వీటిపై నిగ్గు తేల్చాలని జనసేన కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసైనికులు సోమవారం ఆలమూరులో కదంతొక్కారు. తొలుత టౌన్ హాలులో సమావేశమయ్యారు. అనంతరం ర్యాలీగా తరలివెళ్లి తహశీల్దార్ లక్ష్మీపతి, ఎంపీడీవో ఝాన్సీ, వ్యవసాయ శాఖ సహాయ సంచాల కుడు సీహెచకేవీ చౌదరిలకు వినతిపత్రాలు అందించారు. నిజమైన రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చి చెప్పారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని బినామీదారుల వద్ద నుంచి సొమ్ము వాపసు తీసుకుని నిజమైన రైతులకు అందించాలని కోరారు. నాయకులు సంగిత సుభాష్, సూరపురెడ్డి సత్య, గారపాటి త్రిమూర్తులు, తాళ్ల డేవిడ్, బైరిశెట్టి రాంబాబు, కొత్తపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు.