మోటార్‌ సైకిళ్లతో జనసేన ర్యాలీ

ABN , First Publish Date - 2020-09-22T11:33:09+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, నేచురల్‌ గ్యాస్‌ ఇంధనాలపై పన్నును 14.5 నుంచి 24.5 శాతానికి పెంచడం పట్ల నిరసన వ్యక్తం

మోటార్‌ సైకిళ్లతో  జనసేన ర్యాలీ

ఏలూరు కార్పొరేషన్‌, సెప్టెంబరు 21: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, నేచురల్‌ గ్యాస్‌ ఇంధనాలపై పన్నును 14.5  నుంచి 24.5 శాతానికి పెంచడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు తమ ద్విచక్ర వాహనాలను తోసుకుంటూ వెళ్లి నిరసన తెలిపారు. 


జనసేన ఏలూరు ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలపై భారం వేయడం తగదని హెచ్చరించారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కాశీ నరేశ్‌, వీరంకి పండు, పి.సాగర్‌, అల్లు చరణ్‌, మధు, శ్రావణ గుప్త, రాజేశ్‌, సుందరనీడి ప్రసాద్‌, ధర్మేంద్ర, లోవరాజు, ఆంజ నేయులు, రమేశ్‌, సన్యాసి రావు, బొండా రాము, చిరంజీవి, సత్యనారాయణ, భాస్కర్‌, రవి, జనసేన అధికార ప్రతినిఽధి తమ్మిల సోమశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-22T11:33:09+05:30 IST