మారుమోగిన ‘జనగణమన’

ABN , First Publish Date - 2022-08-17T05:45:29+05:30 IST

జాతీయ సమైక్యత వెల్లివిరిసింది.

మారుమోగిన ‘జనగణమన’
సామూహిక జాతీయసామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా భారీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న టీడీపీ అంబర్‌పేట నియోజకవర్గం ఇన్‌చార్జి రాగిఫణి ప్రవీణ్‌కుమార్‌ - బర్కత్‌పుర, ఆంధ్రజ్యోతి

 స్ఫూర్తి నింపిన జాతీయ గీతం

 సామూహిక గీతాలాపనకు అపూర్వ స్పందన

 వెల్లివిరిసిన సమైక్యతాభావం

 కూడళ్లలో జాతీయ జెండాల ప్రదర్శన

 ఉప్పొంగిన దేశభక్తి

అంబర్‌పేట, ముషీరబాద్‌, ఆంధ్రజ్యోతి బృందం

జాతీయ సమైక్యత వెల్లివిరిసింది. అందరినోట దేశభక్తి ఉట్టిపడింది. జాతీయ గీతం మారుమోగింది. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల ప్రజలు మంగళవారం సామూహికంగా

‘జనగణమన’ను ఆలపించారు. జాతీయ సమైక్యతాభావాన్ని చాటారు. సామూహిక గీతాలపనతో ఆయా ప్రాంతాలు మారుమోగాయి.    అన్ని  ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలతోపాటు, ప్రైవేట్‌ సంస్థల వద్ద ఉదయం 11.30 గంటలకు  జాతీయ గీతాలాపన జరిగింది. పురవీధుల్లో   విద్యార్థులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు జాతీయ జెండాలు పట్టుకొని ‘జనగణమన’ను ఆలపించారు. శ్రామికులు సైతం పాల్గొని  దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమ విజయవంతంలో ట్రాఫిక్‌ పోలీసులు  కీలకంగా వ్యవహరించడంతో పలువురు మెచ్చుకున్నారు.  

Updated Date - 2022-08-17T05:45:29+05:30 IST