TDP Leaders: ఏలూరులో రహదారిపై గుంతలను పూడ్చిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-08-19T21:01:11+05:30 IST

జిల్లాలోని పెదవేగి మండలం వేగివాడలో టీడీపీ నేత కొనకళ్ల శివమణి ఆధ్వర్యంలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలను పూడ్చే కార్యక్రమంలో చేపట్టారు.

TDP Leaders: ఏలూరులో రహదారిపై గుంతలను పూడ్చిన టీడీపీ నేతలు

జంగారెడ్డిగూడెం(ఏలూరు జిల్లా): జిల్లాలోని పెదవేగి మండలం వేగివాడలో టీడీపీ (TDP) నేత కొనకళ్ల శివమణి (Konakall shivamani) ఆధ్వర్యంలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. జంగారెడ్డిగూడెం - ఏలూరు ప్రధాన రహదారిపై అధికారులు రోడ్డును నిర్మించారు. కాగా... నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో రహదారిపై చాలా చోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. దీంతో టీడీపీ నాయకులు (TDP Leaders) గుంతలు పూడ్చే కార్యక్రమానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా రహదారిపై ఉన్న గుంతలను సిమెంటు, కాంక్రీట్ కలిపిన మిశ్రమాన్ని వేసి సరి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బోపన సుధ మాట్లాడుతూ... నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తక్కువ సమయంలో రోడ్లు గుంతలు పడ్డాయని, వైసీపీ నాయకుడు కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T21:01:11+05:30 IST