రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జరజాపుపేట విద్యార్థులు
ABN , First Publish Date - 2021-03-06T05:49:11+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈనెల 11 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు కిల్లంపల్లి మల్లిబాబు, చాపా యోషిణి జిల్లా జట్టు తరఫున ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం రాధాకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నెల్లిమర్ల, మార్చి 5: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈనెల 11 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు కిల్లంపల్లి మల్లిబాబు, చాపా యోషిణి జిల్లా జట్టు తరఫున ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం రాధాకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని సారిపల్లిలో జరిగిన జిల్లా జట్టుకు ఎంపిక పోటీలు నిర్వహించినట్టు ఆయన చెప్పారు. ఆ విద్యార్థులను, పాఠశాలవ్యాయామ ఉపాధ్యాయుడు నడిపేన సూర్యనారాయణను హెచ్ఎం అభినందించారు.