సోమన్నకు జాషువా పురస్కారం
ABN , First Publish Date - 2022-09-29T07:30:50+05:30 IST
తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త డి.ఆర్.బి ప్రసాద్ ఆధ్వర్యంలో కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి నిర్వహించారు.
గుడివాడ : తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త డి.ఆర్.బి ప్రసాద్ ఆధ్వర్యంలో కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి నిర్వహించారు. ప్రముఖ కవి గద్వాల సోమన్నకు గుర్రం జాషువా స్మారక సాహితి పురస్కారాన్ని పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దివాకర్ తదితరులు ప్రదానం చేశారు. హెచ్.ఆర్ చంద్రం, కె.పి రామకృష్ణ, పి.వి భవాని, శంకరరావు, రాజశేఖర్, ఎం.మాధవరావు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.