బుమ్రా అదుర్స్.. ప్రపంచ రికార్డును బద్దలుగొట్టిన స్టార్ బౌలర్!
ABN , First Publish Date - 2020-02-03T01:40:09+05:30 IST
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. టీ20ల్లో ఏడు మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి
మౌంట్ మాంగనుయి: టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. టీ20ల్లో ఏడు మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. 58 టీ20లు ఆడిన కులశేఖర ఆరు మెయిడెన్లు వేశాడు. ఇప్పుడు ఏడు మెయిడెన్లతో బుమ్రా ఆ రికార్డును చెరిపేశాడు.
కివీస్తో జరిగిన చివరిదైన ఐదో టీ20లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా ఓ మెయిడెన్ వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేల కూల్చాడు. ఈ మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.