తెలుగు మహిళ కార్యదర్శి జాస్తి కల్యాణి మృతి
ABN , First Publish Date - 2021-04-23T06:48:42+05:30 IST
మచిలీపట్నం తెలుగు మహిళా విభాగం కార్యదర్శి జాస్తి కల్యాణి కరోనాతో గురువారం మృతి చెందారు.
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 22 : మచిలీపట్నం తెలుగు మహిళా విభాగం కార్యదర్శి జాస్తి కల్యాణి కరోనాతో గురువారం మృతి చెందారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మచిలీపట్నం పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్థలత, నియోజక వర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, పట్టణ అధక్షుడు యండి ఇలియాస్ బాషా, టీడీపీ నాయకులు బాబాప్రసాద్, పి.వి.ఫణికుమార్ , పిప్పళ్ల కాంతారావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కల్యాణి మృతి పార్టీకి తీరని లోటన్నారు.