ముగిసిన గంగాపూర్ జాతర
ABN , First Publish Date - 2021-03-01T04:20:31+05:30 IST
మండలంలోని గంగాపూర్ శివారులోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో మూడు రోజులుగా కొనసాగుతున్న జాతర ఉత్సవాలు ఆదివారం ముగిశాయి
రెబ్బెన, ఫిబ్రవరి 28: మండలంలోని గంగాపూర్ శివారులోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో మూడు రోజులుగా కొనసాగుతున్న జాతర ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. మూడు రోజుల పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డితో పాటు ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లన్న దంపతులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. మూడో రోజు భక్తుల రద్దీ అంతగా లేనప్పటికీ జాతరలో వెలసిన దుకాణాల వద్ద కొంత సందడి కనిపించింది. ముఖ్యగా చివరి రోజు జాతరకు వచ్చిన భక్తులు ప్రసాదాలు, అలంకార సామగ్రి కొనుగోలు చే యడానికి ఆసక్తి చూపారు. వ్యాపారులు సైతం జాతర ముగింపు సందర్భంగా ధరలను తగ్గించి విక్రయించారు. కాగా జాతర సంద ర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా స్థానిక సర్పంచ్ వినోద మధునయ్యలతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్చారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆసిఫాబాద్ డీఎస్పీ అచ్చేశ్వర్రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.